నటుడు పృథ్వీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతగా సపోర్ట్ చేశాడో అందరికీ తెలిసిందే. మొదటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారీయన. ప్రత్యేకించి గత ఐదేళ్ల కాలంలో గట్టిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడిన సినిమా వాళ్లలో పృథ్వీ ఒకరు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు.
అక్కడ రెండు రకాల పరిస్థితులే కనిపించాయి. ఒకటి కమ్మ వాళ్లంతా రొటీన్ గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలిచారు, కొంతమంది కాపు నటులు జనసేనకు జై కొట్టారు. సినిమా ఇండస్ట్రీలో ఉనికి కోసం కొందరు జై జనసేన అన్నారు. అది సినీ హీరో పెట్టిన పార్టీ కావడంతో వారు అలా మాట్లాడారు.
అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడిన వారిలో, ఆ పార్టీ తరఫున మాట్లాడుతూ అటు తెలుగుదేశం పార్టీ మీద, ఇటు జనసేన మీద గట్టిగా మాట్లాడిన వారిలో పృథ్వీ ముందు ఉంటూ వచ్చాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడంతో ఆయనకు కీలక పదవి ఏదైనా దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో అతడికి ఇండస్ట్రీ నుంచి మాత్రం సపోర్ట్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.
తాజాగా పృథ్వీని అల్లు అర్జున్ సినిమా నుంచి బయటకు పంపించారని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా ప్రతిపాదనలో ఉంది. త్రిమిక్రమ్ సినిమాల్లో పృథ్వీకి ఏదో ఒక పాత్ర ఉంటూ వస్తోంది. అయితే అల్లు అర్జున్ మాత్రం వ్యతిరేకించాడట. తన మామలు అయిన పవన్ కల్యాణ్, నాగబాబు లపై పృథ్వీ కామెంట్లు చేశాడని, అందుకే అతడిని తన సినిమాలోకి తీసుకోవద్దని అల్లు అర్జున్ స్పష్టం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులూ పృథ్వీకి ఈ తరహా ఇబ్బందులు ఎదురయినట్టుగా లేవు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి తలెత్తేలా ఉంది.
No comments:
Post a Comment