రామ్మోహన్ నాయుడును అలా కట్టేసుకుంటున్న చంద్రబాబు నాయుడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, June 20, 2019

రామ్మోహన్ నాయుడును అలా కట్టేసుకుంటున్న చంద్రబాబు నాయుడు!


తెలుగుదేశం పార్టీని వీడి వరస పెట్టి నేతలు బీజేపీలోకి చేరడం దాదాపు ఖరారు అయ్యింది.  ఇప్పటికే ఐదుగురు రాజ్యసభ సభ్యులు  తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజ్యసభలో బలోపేతం కావడంలో భాగంగా బీజేపీ వారికి స్వాగతం పలకడానికి రెడీ అని సమాచారం.

వారి సంగతలా ఉంటే..లోక్ సభ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీని బీజేపీలోకి చేరడానికి రెడీగానే ఉన్నాని తెలుస్తోంది.అందులో భాగంగా ఇప్పటికే కేశినేని నాని పేరు  ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీపై ఆయన అసహనాన్ని బహిరంగంగా చాటాడు. ఈ క్రమంలో ఆయన బీజేపీలోకి చేరడం దాదాపు ఖరారే అని సమాచరాం.

తెలుగుదేశం పార్టీ తరఫున సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గింది కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే. వారిలో కేశినేని నాని జంప్ అయితే.. ఇక మిగిలేది ఇద్దరు మాత్రమే. గుంటూరు  నుంచి ఎంపీగా నెగ్గిన గల్లా జయదేవ్ ఎన్నికపై ఆల్రెడీ కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఆ వ్యవహారం ఎటు తేలుతుందో చూడాల్సి ఉంది.

ఇక మిగిలింది రామ్మోహన్ నాయుడు మాత్రమే. ఆయన కూడా ఇప్పటికే జంపింగ్ కు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా బీజేపీ వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఇలాంటి క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడకుండా చూసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారట.

అందులో భాగంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం అధ్యక్ష పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు టీడీపీనీ వీడనున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన కు ఆ పదవిని ఇవ్వనున్నారట. ఇదంతా  చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చేపట్టిన పని అని, తెలుగుదేశం పార్టీని వీడే అవకాశం ఉండటంతో, ఆయనకు  సర్ధి చెప్పడానికి, పార్టీ వీడకుండా చూసేందుకు గానూ ఆయనకు తెలుగుదేశం ఏపీ విభాగం అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్టుగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad