వీళ్లంతా టీడీపీ నుంచి జంప్.. చంద్రబాబుకు షాకే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, June 20, 2019

వీళ్లంతా టీడీపీ నుంచి జంప్.. చంద్రబాబుకు షాకే!


మొన్నటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను  తన పార్టీలోకి తీసుకుని అదేదో బలం అని  అనుకున్నారు చంద్రబాబు నాయుడు. అధికారం చేతిలో ఉన్నప్పుడు అనేక మంది నేతలను చంద్రబాబు నాయుడు కొనుక్కొన్నారు. ఏకంగా ఇరవై మూడు  మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి ఫిరాయింపులతో తన పార్టీ బలోపేతం అవుతుందని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అయితే అలాంటి ఫిరాయింపులు తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. వాటివల్ల తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం దక్కడం మాట అటుంచి, తీవ్రమైన నష్టం జరిగింది. ఎన్నికల ఫలితాలే అందుకు సాక్ష్యం,

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వరస పెట్టి నేతలు బయటకు వెళ్లిపోవడం  షురూ అయినట్టుగా ఉంది. ఈ విషయంలో ఇప్పుడు ప్రధానంగా ఎంపీల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. రాజ్యసభ సభ్యులు ముందుగా తెలుగుదేశం పార్టీని  వీడే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.

టీడీపీ తరఫున గత ఐదేళ్లలో రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో పలువురు ఇప్పుడు జంప్ అంటున్నారట. టీజీ వెంకటేష్. సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి, తోట రామలక్ష్మి.. ఈ ఐదుగురూ భారతీయ జనటా పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నారని  సమాచారం.

వీరు తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఆరు మంది ఎంపీలు ఉండగా.. వారిలో ఐదుగురు జంప్ అంటున్నారట. టీడీపీకి మిగలేది కేవలం కనకమేడల రవీంద్రకుమార్ మాత్రమే అని సమాచారం.

రాజ్యసభలో బలాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ ఐదు మంది ఎంపీలనూ చేర్చుకోవడానికి బీజేపీ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే లోక్ సభలో టీడీపీ ఎంపీల్లో కేశినేని నాని కూడా జంపింగుకు రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad