'ప్రజా వేదిక' ను కూల్చాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలపై తెలుగుదేశం నేతలు గయ్యిమంటున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఈ అంశంలో తెగ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజా వేదికను కూల్చడం సరి కాదని అంటున్నారు. అది అక్రమ కట్టడం అని ప్రభుత్వమే తేల్చి చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని కూల్చి వేయాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
దీనిపై టీడీపీ ఫైర్ అవుతూ ఉంది. కట్టిందే అక్రమంగా, అది కూడా ప్రజాధనంతో. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని చంద్రబాబు నాయుడు అలా అక్రమ కట్టడాన్ని నిర్మించడమే కాకుండా, ఓడిపోయిన తర్వాత కూడా దాన్ని తనకే ఇవ్వాలని ఆయన కోరడం విడ్డూరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ప్రభుత్వం స్పందించింది. దాన్ని కూల్చివేయాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతూ ఉన్నారు.
అయితే ఒక టీడీపీ నేత మాత్రం ఈ అంశంలో భిన్నంగా స్పందించాడు. అది అక్రమ కట్టడమే అని ఆ ఎంపీ తేల్చాడు.
దాన్ని కూల్చివేయాలని ఆయన సూచించాడు. అయితే దాని కన్నా ముందు కృష్ణా నదీ తీరంలో మిగతా అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆయన పేర్కొన్నాడు. మిగతా అక్రమ కట్టడాలను కూల్చి వేసిన తర్వాత ప్రజా వేదికను కూల్చేయాలని కేశినేని నాని ఉచిత సలహా ఇచ్చాడు. మొత్తానికి మిగతా టీడీపీ లీడర్లు దాన్ని కూల్చివేయరాదు అని అంటుంటే.. కేశినేని నాని మాత్రం.. దాన్ని కూల్చేయాలని అనడం ఆసక్తిదాయకంగా మారింది. ఈ మాటతో టీడీపీ వాళ్లే డిఫెన్స్ లో పడ్డారు.
No comments:
Post a Comment