కుల సమీకరణాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు తన మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు అనే విశ్లేషణ ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. మంత్రివర్గంలో రెడ్లకు జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించి, తన పార్టీ కేవలం రెడ్ల పార్టీ అనే అభిప్రాయాన్ని తగ్గించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఆర్కే రోజాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేదు అనే విశ్లేషణ వినిపిస్తూ ఉంది.
ఈ క్రమంలో ఈ అంశాలపై రోజా స్పందిస్తున్నారు. ఒకవైపు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తనకు ఏ మాత్రం అసంతృప్తి లేదని రోజా చెబుతోంది. అయితే ఇదే సమయంలో ఆమె క్యాస్ట్ ఈక్వెషన్స్ గురించి కూడా మాట్లాడటం గమనార్హం.
బహుశా క్యాస్ట్ ఈక్వెషన్స్ ను బ్యాలెన్స్ చేయడానికే సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వలేదేమో అని రోజా వ్యాఖ్యానించారు. అయితే అదే సమయంలో తనను ‘రెడ్డి’ కులస్తురాలిగా భావించవద్దని రోజా అంటున్నారు.
తను పుట్టిన కులం అదే అయినా, తను పెళ్లి చేసుకుంది ఒక బీసీని అని రోజా చెబుతోంది. ఆమె భర్త, దర్శకుడు సెల్వమణి వన్నియర్ కులానికి చెందిన వ్యక్తి. ఆ అంశాన్ని రోజా ప్రస్తావిస్తోంది. తను ఒక బీసీని పెళ్లి చేసుకున్నట్టుగా రోజా గుర్తు చేస్తోంది. తన బంధుగణంలో రకరకాల కులాల వారు ఉన్నారని, తన పీఏ కూడా వేరే కులానికి చెందిన వ్యక్తే అని రోజా చెబుతోంది. ఇలా తనకు కేబినెట్లో జగన్ మోహన్ రెడ్డి చోటు కల్పించాల్సింది అన్నట్టుగా రోజా ఇన్ డైరెక్టుగా చెబుతూ ఉన్నారు.
అయితే ప్రస్తుతానికి మాత్రం అవకాశం లేనట్టే. బహుశా రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లో మార్పు చేర్పుల్లో జగన్ మోహన్ రెడ్డి ఈమెకు ప్రాధాన్యతను ఇవ్వవచ్చు అనే విశ్లేషణలు సాగుతున్నాయిప్పుడు!
No comments:
Post a Comment