గ్రేట్: అవమానాలు ఎదుర్కొన్న అసెంబ్లీకి అధికారంతో జగన్ ఎంట్రీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, June 12, 2019

గ్రేట్: అవమానాలు ఎదుర్కొన్న అసెంబ్లీకి అధికారంతో జగన్ ఎంట్రీ!



ఒకటా రెండా.. అనేక సందర్భాల్లో వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీలో తీవ్రంగా ఇబ్బంది పెట్టింది తెలుగుదేశం పార్టీ. అధికారం చేతిలో ఉంది కదా.. అని తెలుగుదేశం పార్టీ వాళ్లు జగన్ విషయంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించారు. వారి విషయంలో అత్యంత అనుచితంగా మాట్లాడటానికి కూడా వాళ్లు వెనుకాడలేదు!

అసెంబ్లీ రూపాన్నే మార్చేసింది తెలుగుదేశం పార్టీ. వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ తరఫున  నెగ్గిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది. సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని తగ్గించి వేయడమే కాకుండా.. ఆ పార్టీ  తరఫున  గట్టిగా నిలిచిన వారి విషయంలో అనుచితంగా మాట్లాడటానికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లు వెనుకాడలేదు.

అడుగడుగునా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అవమానించింది తెలుగుదేశం పార్టీ. అధికారం చేతిలో ఉందనే అహంకారాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లు చూపించారు. చంపేస్తా.. నరికేస్తా.. పాతేస్తా.. అనే మాటలతో మొదలు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇష్టానుసారం మాట్లాడారు.

ఆఖరికి ఏపీ అసెంబ్లీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అది అసెంబ్లీనే కాదు అని, ఫిరాయింపు రాజకీయాలతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీని అపవిత్రం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాపోయింది. అయినా  పట్టించుకునే వారు కరువయ్యారు.

దీంతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ విషయంలోనూ తెలుగుదేశం వాళ్లు విమర్శలు మొదలుపెట్టారు. ఫిరాయింపు రాజకీయాల గురించి మాట్లాడని పవన్ కల్యాణ్  అసెంబ్లీకి వెళ్లడం లేదని జగన్ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే అసెంబ్లీకి వెళ్లకుండా జనం మధ్యకు వెళ్లారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.

దాదాపు ఏడాదిన్నర పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి ఎంటర్ కాలేదు. ఇప్పుడు , ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలోకి ఎంట్రీ ఇస్తోంది. అది అధికార పక్షంగా!

తాము బహిష్కరించిన అసెంబ్లీలో అధికారాన్ని చేపట్టి, అసెంబ్లీని నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అవమానాలు పొందిన చోట అధికార పార్టీగా నిలిచింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇదొక గొప్ప అచీవ్ మెంట్ అని చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  విజయగాథ అని వివరించాలి!


No comments:

Post a Comment

Post Bottom Ad