అక్కినేని ఇంటి కోడలు సమంతకు ఇది గట్టి పరీక్షే! నటిగా ఆమె ఇప్పుడు కఠినమైన పరీక్షను ఎదుర్కొంటోంది. ఆమె తదుపరి కెరీర్ ను తాజా సినిమా ఒకటి డిసైడ్ చేసేలా ఉంది.
గత కొన్నాళ్లుగా తను ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నట్టుగా, ఇక పై కూడా అలానే చేయాలనుకుంటున్నట్టుగా సమంత ప్రకటించుకుంటోంది. అయితే అలా చేయాలంటే త్వరలో విడుదల అయ్యే ఆమె సినిమా 'ఓ బేబీ'సానుకూల ఫలితాన్ని పొందాల్సి ఉంటుంది.
ఈ సినిమా ఒక సౌత్ కొరియన్ సినిమా ఆధారంగా రూపొందుతోంది. అఫిషియల్ గా రీమేక్ చేస్తూ ఉన్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో సమంత తప్ప ఇప్పుడు ఫామ్ లో ఉన్న నటీనటులు ఎవరూ కనిపించడం లేదు. లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ వంటి వాళ్లున్నా వాళ్లను చూసి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే పరిస్థితి లేదు.
ఈ సినిమాలో నాగశౌర్య ఒక పాత్రలో కనిపిస్తాడట. అయితే అది గెస్ట్ అప్పీరియన్స్ మాత్రమే. అయినా నాగశౌర్యకు సినిమాకు కలెక్షన్లను పెంచేంత సీన్ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో భారమంతా సమంత మీదే ఉంది.
ఇది వరకూ ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా.. వాటిల్లో ఇతర స్టార్లు కూడా ఉండేవారు. ఇప్పుడు ఎవ్వరూ లేరు. దీంతో 'ఓ బేబీ' వచ్చే ఓపెనింగ్స్ సమంత స్టామినాకు నిదర్శనంగా ఉండబోతున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.
No comments:
Post a Comment