ఇటీవలే మీడియా ముందుకు వచ్చి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంతలోనే ఎన్నికలకు రెడీ అని ప్రకటించారు. తమిళనాడులో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నిన్ననే ముగిసింది. ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ కి సై అని ప్రకటించారు.
తమిళనాట త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలో జరిగే అవకాశం ఉండటంతో రజనీకాంత్ ప్రకటన ఆసక్తిని సంతరించుకుంది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ అలా ముగిసిందో లేదో.. ఇంతలోనే రజనీకాంత్ అసెంబ్లీ ఎన్నికలకు సై అని ప్రకటించారు. తన పార్టీ పోటీలో ఉంటుందని తెలిపారు.
ఇక లోక్ సభ ఎన్నికల్లో ఎవరు నెగ్గవచ్చని అనుకుంటున్నారు? ఎవరు ప్రధానమంత్రి అవుతారని అనుకుంటున్నారు? అనే ప్రశ్నలకు ఆసక్తిదాయకమైన రీతిలో సమాధానం ఇచ్చారు సూపర్ స్టార్. ‘ఆ విషయం మే ఇరవై మూడో తేదీన తెలుస్తుంది’ అని రజనీకాంత్ చమత్కరించారు. ఆ రోజు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే.
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో రజనీకాంత్ పరోక్షంగా తమిళనాట బీజేపీ కూటమికి మద్దతు పలికినట్టుగా వ్యవహరించారు. బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే నదుల అనుసంధానం మీద దృష్టి నిలుపుతుందని రజనీకాంత్ వ్యాఖ్యానించారు!
No comments:
Post a Comment