మంత్రి పదవులు అడుగుతున్న నేతలకు జగన్ ఏం చెబుతున్నారు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, April 19, 2019

మంత్రి పదవులు అడుగుతున్న నేతలకు జగన్ ఏం చెబుతున్నారు?


ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. ఫలితాల గురించి అందరూ ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విజయం మీద అన్ని పార్టీల వాళ్లూ దాదాపుగా ఒకే విశ్వాసంతో ఉన్నారు. ఎవరికి వారు తమదే  విజయం అని అంటూ ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు విజయం పట్ల మరింత విశ్వాసంతో ఉన్నారు.

ఇక పోలింగ్ ఫలితాలు రావడానికి మాత్రం ఇంకా సమయం ఉంది. మరో నెల రోజులకు  పైనే ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంది. మే ఇరవై మూడున  లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కాబోతూ ఉన్నాయి.

అయితే విజయం పట్ల విశ్వాసంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో చర్చలు మొదలయ్యాయట. ఈ విషయంలో పలువురు నేతలు డైరెక్టుగా జగన్ ను వెళ్లి కలుస్తున్నారని సమాచారం.

పార్టీ అధికారంలోకి రానున్న నేపథ్యంలో తమకు కేబినెట్లో చోటు కల్పించాలని పలువురు నేతలు కోరుతూ ఉన్నారట. ఈ మేరకు జగన్ తో పలువురు సమావేశం అయినట్టుగా సమాచారం.

అలాంటి వాళ్లకు జగన్ ఒకే సమాధానం చెబుతున్నారట.  'తొందర వద్దు.. ఫలితాలు రానివ్వండి చూద్దాం..' అని జగన్ సమాధానం ఇస్తున్నట్టుగా సమాచారం.

No comments:

Post a Comment

Post Bottom Ad