వైఎస్సార్సీపీలో చేరిన ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎవరంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 08, 2019

వైఎస్సార్సీపీలో చేరిన ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎవరంటే..


శాసనసభ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ బలం పుంజుకుంటోంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు, టీడీపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.

తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన దాసరి బాలవర్ధన్ రావు, కర్నూలు జిల్లా పాణ్యం, కోయిలకుంట్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చల్లా రామకృష్ణారెడ్డి ఇద్దరూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి ఆ పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదేవిధంగా టీడీపీలో అంత క్రియాశీలకంగా లేని దాసరి బాలవర్థన్ రావును ఆయన సోదరుడు ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన పారిశ్రామికవేత్త విజయ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జైరమేశ్ జగన్ వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేర్పించారు. వీరిద్దరి చేరికతో ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోనుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad