శ్రీదేవి కూతురు అతడితో ప్రేమలో పడిందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, March 07, 2019

శ్రీదేవి కూతురు అతడితో ప్రేమలో పడిందా?

అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా తన తల్లి బాటలోనే సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ 22 ఏళ్ల ముద్దుగుమ్మ మార్చి 6న తన పుట్టినరోజు సందర్భంగా వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకుంది. జాన్వీతోపాటు ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ఆమె సోదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తన మొదటి చిత్రం 'ధడక్' తో శ్రీదేవికి తగ్గ తనయగా నిరూపించుకున్న జాన్వీ ప్రస్తుతం ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'తఖ్త్'లో కీలక పాత్రలో నటిస్తోంది. మల్టీస్టారర్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కాగా, ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండే మనవడితో ఘాటు ప్రేమలో ఉందని బాలీవుడ్ కోడై కూస్తోంది. వీరిద్దరూ గాఢ చుంబనంలో ఉన్న ఫొటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.

సినిమాల్లోకి జాన్వీ రాకముందు ముంబైలోని ప్రతిష్టాత్మక ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుంది. ఆమెతోపాటే సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియా కూడా అదే స్కూల్ లో చదువుకున్నాడు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రొమాన్స్ నడుస్తోందని సమాచారం. అప్పట్లో శ్రీదేవి ఈ వ్యవహారంలో జాన్వీని మందలించి ముందు కెరీర్ పై దృష్టి సారించాలని చెప్పినట్టు తెలుస్తోంది. అయినా చాటుమాటుగా అతడితో ఎంజాయ్ చేస్తోంది.. జాన్వీకపూర్. ఈ ప్రేమ ఎటు దారితీస్తుందోనని బోనీ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

No comments:

Post a Comment

Post Bottom Ad