అన్నలు ఒక పార్టీలో.. తమ్ముళ్లు మరో పార్టీలో - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 03, 2019

అన్నలు ఒక పార్టీలో.. తమ్ముళ్లు మరో పార్టీలో

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జంపింగ్ జపాంగ్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ పార్టీలో ఉన్నవాళ్లు వేరే పార్టీలోకి, వేరే పార్టీల్లో ఉన్నవాళ్లు మరో పార్టీలోకి దూకుతున్నారు. ఎన్నికల సమయంలో ఈ జంపింగ్ లు కొత్త కాకపోయినా ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో కొనసాగడమే. ప్రధాన పార్టీల తరఫున ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి తమ కుటుంబ సభ్యులనే దించుతున్నారు. వారితోనే తాము వేరే పార్టీ తరఫున పోటీ పడుతున్నారు.

ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఎవరూ గెలిచినా అధికారం తమ కుటుంబం దగ్గరే ఉంటుందని భావించడమే దీనికి కారణం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పెద్దాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో రాజప్పకు సీటు దక్కే అవకాశం లేకపోవడం, సీటు వచ్చినా గెలిచే అవకాశం లేకపోవడంతో ఆయన తన సోదరుడుని జనసేన పార్టీలోకి పంపించారు.

అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ  బుద్ధా వెంకన్న టీడీపీలో ఉండగా ఆయన సోదరుడు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు రాజగోపాలరెడ్డి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉండగా, ఆయన మేనల్లుడు కూన రవి అదే నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా తమ కుటుంబ సభ్యులనే వేర్వేరు పార్టీల్లోకి పంపి ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారం తమ చేతులు జారకుండా నేతలు జాగ్రత్తపడుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad