ప్రతిసారీ ఎన్నికల సమయంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తుంటాయి. ఇందులో వింత ఏమీ లేకపోయినా ఆ పార్టీల గుర్తులు ప్రధాన పార్టీలను తలపించే మాదిరిగా ఉండటంతో ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నష్టపోతున్నాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇలాగే నష్టపోయింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారు. అయితే ట్రక్ గుర్తుతో పోటీ చేసిన సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు టీఆర్ఎస్ ఓట్లను భారీగా చీల్చడంతో పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడం, మెజారిటీ తగ్గడం జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ తన పార్టీకి హెలికాప్టర్ ను గుర్తుగా ఎంపిక చేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు.. ఫ్యాన్. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ పైన ఫ్యాన్ రెక్కల మాదిరిగా ఉండటంతో ఓట్లు వేసే నిరక్ష్యరాస్యులు, గ్రామీణులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అదీకాకుండా కెఏ పాల్.. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న క్రైస్తవుల ఓట్లు చీల్చి చంద్రబాబుకు మేలు చేయడానికే పార్టీ పెట్టారనే చర్చ ప్రస్తుతం సాగుతోంది.
ఫ్యాన్ గుర్తుకు, హెలికాప్టర్ పైన రెక్కలకు తేడా స్పష్టంగానే ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ ఆందోళన చెందుతోంది. పార్టీ గుర్తు విషయంలో జనసేన పార్టీకే పెను ప్రమాదం పొంచి ఉంది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు.. టీ గ్లాస్. తాజాగా దళిత బహుజన పార్టీని స్థాపించినవారు తమ పార్టీ గుర్తుగా టీ కప్పు, సాసర్ తెచ్చుకున్నారు. జనసేన పార్టీ గుర్తు టీ గ్లాస్, దళిత బహుజన పార్టీ గుర్తు కప్పు చూడడానికి ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా జనసేనకు పడే ఓట్లన్నీ దళిత బహుజన పార్టీకి పడే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా జనసేన పార్టీ దీన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లపోతే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.
అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ తన పార్టీకి హెలికాప్టర్ ను గుర్తుగా ఎంపిక చేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు.. ఫ్యాన్. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ పైన ఫ్యాన్ రెక్కల మాదిరిగా ఉండటంతో ఓట్లు వేసే నిరక్ష్యరాస్యులు, గ్రామీణులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అదీకాకుండా కెఏ పాల్.. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న క్రైస్తవుల ఓట్లు చీల్చి చంద్రబాబుకు మేలు చేయడానికే పార్టీ పెట్టారనే చర్చ ప్రస్తుతం సాగుతోంది.
ఫ్యాన్ గుర్తుకు, హెలికాప్టర్ పైన రెక్కలకు తేడా స్పష్టంగానే ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ ఆందోళన చెందుతోంది. పార్టీ గుర్తు విషయంలో జనసేన పార్టీకే పెను ప్రమాదం పొంచి ఉంది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు.. టీ గ్లాస్. తాజాగా దళిత బహుజన పార్టీని స్థాపించినవారు తమ పార్టీ గుర్తుగా టీ కప్పు, సాసర్ తెచ్చుకున్నారు. జనసేన పార్టీ గుర్తు టీ గ్లాస్, దళిత బహుజన పార్టీ గుర్తు కప్పు చూడడానికి ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా జనసేనకు పడే ఓట్లన్నీ దళిత బహుజన పార్టీకి పడే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా జనసేన పార్టీ దీన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లపోతే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.
No comments:
Post a Comment