ఆ ఎంపీలిద్దరూ ఈసారి పోటీ చేసేది అసెంబ్లీకేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 23, 2019

ఆ ఎంపీలిద్దరూ ఈసారి పోటీ చేసేది అసెంబ్లీకేనా?

గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన చాలామంది ఈసారి అసెంబ్లీకి  పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎంపీలుగా గెలిచే అవకాశాలు లేకపోవడం, ఎంపీగా పోటీ చేస్తే సంబంధిత పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఖర్చును కూడా తామే భరించాల్సి రావడం తదితర కారణాలతో పార్లమెంట్ కు పోటీ చేయడానికి మొగ్గుచూపడం లేదు. ఇప్పటికే ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఇద్దరూ అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లాలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించింది. ప్రస్తుతం భీమిలి నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి (ఎస్సీ రిజర్వుడ్) నియోజకవర్గం నుంచి అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పోటీ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే ఈయనను అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ప్రకటించాల్సి ఉంది.

వీరేకాకుండా టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు, వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా అసెంబ్లీలోకి పోటీ చేసే యోచనలో ఉన్నారు. విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు కూడా ఈసారి అసెంబ్లీకే పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. టీడీపీ అదినేత చంద్రబాబు కూడా ఈసారి ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం.







No comments:

Post a Comment

Post Bottom Ad