ఒకప్పటి ప్రముఖ హీరోయిన్లు రాశి, రంభ తెలియనివారు లేరు. తమ అందచందాలతో, బరువుందాలతో కుర్రకారును కట్టిపడేశారు. ఆ బరువందాలే ఇప్పుడు ఈ భామామణులిద్దరికీ చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇంకోసారి ఆ పనిచేస్తే అంతే అంటూ కోర్టు చేత తిట్లు కూడా తినాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
కలర్స్ అనే సంస్థ ప్రకటనలు చూసి ఒక వినియోగదారుడు ఆ సంస్థ ఉత్పత్తులను వాడాడు. అయితే తన రంగులో ఎలాంటి మార్పు రాకపోవడంతో మోసపోయానని గుర్తించి విజయవాడలోని వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. ప్రముఖ నటీమణులు రాశి, రంభలాంటి వారు కలర్స్ సంస్థ యాడ్స్ లో నటించారని, కలర్స్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాతే తాము మంచి రంగు వచ్చామని వారు ప్రకటనల్లో తెలిపారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చాడు.
రాశి, రంభ స్ఫూర్తితో తాను కూడా కలర్స్ ప్రొడక్ట్స్ ను వాడానని ఎలాంటి మార్పూ రాలేదని, ఇదంతా మోసమని, తాను చెల్లించిన రూ.74,652 మొత్తాన్ని చెల్లించాలని కోర్టును కోరాడు. దీంతో కోర్టు ఈ మొత్తాన్ని తొమ్మిది శాతం వడ్డీ వేసి పిటిషనర్ కు చెల్లించాలని కలర్స్ సంస్థను ఆదేశించింది. అంతేకాకుండా వినియోగదారులను మోసపుచ్చేవిగా ఉన్న ఆ హీరోయిన్ల ప్రకటనలను వెంటనే ఆపేయాల్సిందిగా న్యాయమూర్తి సూచించారు. అదేవిధంగా నటీమణులు కూడా ఇలాంటి యాడ్స్ లో నటించేముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని లేదంటే వారికి కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి ప్రకటనల్లో నటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హీరోయిన్లు ఇద్దరిని హెచ్చరించారు. అయితే కోర్టు వారికి జరిమానా విధించకపోవడంతో హీరోయిన్లు ఇద్దరూ ఊపిరిపీల్చుకున్నారు.
No comments:
Post a Comment