2014లో కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో జరిగిన మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం అంత సునాయాసంగా వచ్చినదేమీ కాదు. రాష్ట్ర సాధించడంలో కీలక వ్యక్తి అయిన కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ మొత్తం 119 సీట్లలో సాధించింది 34శాతం ఓట్లతో కేవలం 63 సీట్లే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిన విషయం తెలిసిందే. సూర్యాపేట, ములుగు నియోజక వర్గాల్లో అయితే కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలకు కలిసి వచ్చిన ఓట్ల కంటే తక్కువగా పొందిన టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇవన్నీ అంచనా వేస్తే 2014లోనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తే కేసీఆర్ గజ్వేల్ కూడా ప్రమాదంలో పడేదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2014లో కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో జరిగిన మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం అంత సునాయాసంగా వచ్చినదేమీ కాదు. రాష్ట్ర సాధించడంలో కీలక వ్యక్తి అయిన కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ మొత్తం 119 సీట్లలో సాధించింది 34శాతం ఓట్లతో కేవలం 63 సీట్లే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిన విషయం తెలిసిందే. సూర్యాపేట, ములుగు నియోజక వర్గాల్లో అయితే కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలకు కలిసి వచ్చిన ఓట్ల కంటే తక్కువగా పొందిన టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇవన్నీ అంచనా వేస్తే 2014లోనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తే కేసీఆర్ గజ్వేల్ కూడా ప్రమాదంలో పడేదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment