పురిటి నొప్పులతో మహిళ.. గవర్నర్‌ ఏం చేశాడంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 01, 2018

పురిటి నొప్పులతో మహిళ.. గవర్నర్‌ ఏం చేశాడంటే..

Brigadier-Mishra-Helps-To-Pregnant-Lady
హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బ్రిగేడియర్‌ మిశ్రా చేసిన సాయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణిని తన సొంత హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం తవాంగ్‌ ప్రాంతంలో మైత్రి దివస్‌ కార్యక్రమానికి గవర్నర్‌ హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో ఓగర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు గవర్నర్‌కు తెలిసింది. దీంతో ఆయన తన హెలికాప్టర్‌లో బాధితురాలితో పాటు ఆమె భర్తను ఇటానగర్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. మధ్యలో పలు అవాంతరాలు ఎదురవ్వగా వాయుసేనతో మాట్లాడి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గర్భిణిని ఆస్పత్రికి తరలించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad