కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. సర్వేలపై ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలు ఆయన ఉల్లంఘించించినట్లు తెలంగాణ రాస్ట్ర సమితి ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకొచ్చింది. తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారని తన సర్వేలో వెల్లడైందని లగడపాటి ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం ఎన్నికల ఫలితాలపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Post Top Ad
Saturday, December 01, 2018
లగడపాటిపై టీఆర్ఎస్ ఫిర్యాదు.. ఎందుకంటే..?
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment