మరి పార్టీ మారుతున్న ఆ ఎంపీలు వీరు కాదంట! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 15, 2018

మరి పార్టీ మారుతున్న ఆ ఎంపీలు వీరు కాదంట!

trs mps

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎంపీలు  సీతారాం నాయక్,  కొండా విశ్వేశ్వర రెడ్డిలు పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తలను వారిద్దరూ ఖండించారు. ఎంపీ సీతారాం నాయక్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు టీఆర్‌ఎస్ ఎంపీలు పార్టీ మారుతున్నారని రేవంత్ మైండ్‌గేమ్‌ ఆడారని అన్నారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారుతున్న ఆ ఇద్దరు ఎంపీలేవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఖండించారు. అయితే అందరూ అనుకున్నట్లు ఆ ఎంపీలు వీరు కాకపోతే మరి ఎవరో రేవంత్ రెడ్డికే తెలియాలి.

No comments:

Post a Comment

Post Bottom Ad