సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన 2.0 నేడు విడుదలైంది. ఏఆర్ రెహమాన్ సంగీతానికి త్రీడీ, 4డీ సౌండ్ సిస్టమ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తదితర స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా తోడవడంతో సినిమా రికార్డులు మార్మోగుతున్నాయి. రోబోకు సీక్వెల్గా తీసిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎప్పటిలాగే రజనీ తనదైన శైలిలో అదరగొట్టగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా సినిమాలో ఇరగదీశారు. రోబో వెన్నెలగా అమీ జాక్సన్ కూడా తన పరిధి మేరకు ఆకట్టుకుంది.
మనుషులు మొబైల్ ఫోన్లకు ఎలా బానిసలుగా మారుతున్నారు? దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడతాయనే అంశాలను ఆధారంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. విజువల్ ఎఫెక్ట్స్లో తారాస్థాయిని అందుకున్న ఈ సినిమా ప్రేక్షకులను కొత్త లోకంలో ఉర్రూతలూగిస్తోంది. పాటలు లేకుండా సినిమాను తీసినప్పటికీ సౌండ్ సిస్టమ్లో 4డీ సౌండ్ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లారు.
No comments:
Post a Comment