తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన రామయ్యగారి సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్లోనే ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పొందారు. జస్టిస్ బి. సుభాషణ్రెడ్డి వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సుభాష్ రెడ్డి 2001–02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా, 2002లోనే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 ఫిబ్రవరి నుంచి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన రామయ్యగారి సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్లోనే ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పొందారు. జస్టిస్ బి. సుభాషణ్రెడ్డి వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సుభాష్ రెడ్డి 2001–02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా, 2002లోనే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 ఫిబ్రవరి నుంచి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
No comments:
Post a Comment