3–1తో వన్డే సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 02, 2018

3–1తో వన్డే సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్


విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో 3–1తో భారతజట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గురువారం గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. రోహిత్(56 బంతు ల్లో 63 నాటౌట్), కోహ్లి(29 బంతుల్లో 33 నాటౌట్) తమదైన శైలిలో విజృంభించి మరో 35.1 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించారు. మూడు సెంచరీలు సహా సిరీస్‌లో 453 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.

No comments:

Post a Comment

Post Bottom Ad