పార్లమెంట్లో కారం చల్లుకున్న ఎంపీలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 17, 2018

పార్లమెంట్లో కారం చల్లుకున్న ఎంపీలు!


శ్రీలంక పార్లమెంట్‌లో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శుక్రవారం విశ్వాస పరీక్ష చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో రాజపక్స మద్దతుదారులైన యూపీఎఫ్‌ఏ ఎంపీలు చెలరేగిపోయారు. కొందరు స్పీకర్‌ కుర్చీని ఆక్రమించి, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫర్నిచర్‌ విరగ్గొట్టారు, పుస్తకాలను విసిరేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడి చల్లారు. ఈ తంతంగాన్నంతా గమనించిన స్పీకర్‌ పోలీసులను పిలిపించారు. అయితే పోలీసులపైకి కూడా ఎంపీలు కారం చల్లారు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తూ పోలీసు రక్షణ నడుమ స్పీకర్ బయటకు వెళ్లిపోయారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad