|
ప్రతీకాత్మక చిత్రం |
భర్తపై కోపంతో ఓ మహిళ 18 రోజుల పసికూన అని కూడా చూడకుండా తన బిడ్డను నేలకేసి కొట్టి చంపింది. చెన్నైలోని కసిమేడు సింగారవేలన్ నగర్ ప్రాంతానికి చెందిన సత్యరాజ్, సెలెస్టిన్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. అయితే సత్యరాజ్కు జయంతి అనే మహిళతోనూ వివాహమైందని, వారికి ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తోటి కూలీలు ఆమెకు చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆమె చిన్నారిని నేలకేసి కొట్టింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తన భర్తకు మరో స్త్రీతో వివాహమైందని, కుటుంబంపై శ్రద్ధ వహించడం లేదనే మనస్తాపంతోనే కూతురుని చంపానని ఒప్పుకుంది.
No comments:
Post a Comment