బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్క్రాఫ్ట్పై విధించిన నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. దీంతో ఆముగ్గురు భారత్తో సిరీస్కు అందుబాటులో ఉండడం లేదని స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా జట్టుకు ఇంటా బయటా అన్నీ పరాజయాలే ఎదురయ్యాయి. పరిస్థితి గమనించిన ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ) ఈ ముగ్గురిపై నిషేధం ఎత్తివేయాలని కొంతకాలంగా సీఏను కోరుతోంది. ఈ క్రమంలో మంగళవారం సీఏ చైర్మన్ ఎడ్డింగ్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. క్రికెట్, దేశానికి మాయని మచ్చ తెచ్చిన ఆ క్రికెటర్లను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment