ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటాం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటాం

Kohli-Confident-On-Aus-Tour
ఇంగ్లండ్‌ సిరీస్‌లో భారత జట్టు కొన్ని తప్పుల్ని పదే పదే చేసిందని, ఆసీస్‌తో సిరీస్‌లో అవి పునరావృతం కాకుండా సరిదిద్దుకుంటామని భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాలో రెండు నెల సుదీర్ఘ పర్యటనలో భాగంగా బుధవారం నుంచి భారత్‌, ఆసీస్‌ మధ్య 3 టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ కోహ్లీ మంగళ వారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంగ్లండ్‌లో 4–1తో టెస్టు సిరీస్‌ కోల్పోవడంపై మాట్లాడుతూ ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందన్నాడు. ఒకరిద్దరు లేనంత మాత్రాన ఆసీస్‌ జట్టు బలహీనంగా ఉన్నట్టు కాదని ఇప్పటికీ అది ప్రపంచ స్థాయి జట్టేనని అన్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad