జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు, బహిరంగ సభలు ఇలా పవన్ పర్యటన సాగుతోంది. కాగా, తెలంగాణ జనసేన కార్యకర్తలు పశ్చిమ గోదావరికి చేరుకుని పవన్ కల్యాణ్ ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేయాలని, చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉందని, పోటీ చేస్తే గెలవడానికి అవకాశం ఉందని ఆయనకు వివరించారు. కాబట్టి పోటీ చేయడంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన జనసేనాని తెలంగాణలో పోటీ చేయడంపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చిస్తామని వారికి తెలిపారు.
Post Top Ad
Tuesday, October 09, 2018
పవన్ కల్యాణ్ ను కలిసిన తెలంగాణ జనసేన కార్యకర్తలు
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment