రెక్కలు విప్పుతున్న స్వైన్ ఫ్లూ. విశాఖలో ముగ్గురికి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

రెక్కలు విప్పుతున్న స్వైన్ ఫ్లూ. విశాఖలో ముగ్గురికి

చలికాలం  దగ్గరకు వస్తుండటంతో మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో ముగ్గురికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరిలో 15 ఏళ్ల బాలిక విశాఖ నగరంలోని ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరో ఇద్దరు విశాఖలోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ముగ్గురికి స్వైన్ ఫ్లూ నిర్దారణ పరీక్షలు చేయగా స్వైన్ ఫ్లూ ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. స్వైన్ ఫ్లూ వ్యాపిస్తోందని తెలియడంతో విశాఖలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad