రాఖీసావంత్పై తనుశ్రీ పదికోట్ల రూపాయల దావా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 22, 2018

రాఖీసావంత్పై తనుశ్రీ పదికోట్ల రూపాయల దావా!


బాలీవుడ్తోపాటు దేశ చలనచిత్ర రంగంలో మీటూ ఉద్యమాన్ని ఉదృతం చేసిన తనుశ్రీ దత్తా రాఖీసావంత్ పై పదికోట్ల రూపాయల దావా దాఖలు చేసింది. 2008లో హార్న్ ఓకే ప్లీజ్.. చిత్రీకరణ సమయంలో తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని ఉందని రాఖీ సావంత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను రాఖీసావంత్ వెనక్కు తీసుకోకుంటే రెండేళ్ల జైలు శిక్ష లేదా ఫైన్ చెల్లించక తప్పదని తనుశ్రీ లాయర్ నితిన్ సాత్పుతే వెల్లడించాడు. ఒక్కోసారి శిక్షతోపాటు ఫైన్ కూడా పడే అవకాశం లేకపోలేదన్నాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad