ఆదాయపన్ను శాఖ దాడుల నేపథ్యంలో వచ్చిన వార్తల్లో వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైనట్లు ప్రచారం చేసిన మీడియా సంస్థలు తనకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అదంతా తప్పుడు ప్రచారం అని ఆయన కొట్టిపారేశారు. మీడియాలో వచ్చిన ప్రచారం ఆధారంగా ఇన్కమ్ టాక్స్ అధికారులు ప్రశ్నిస్తూ తనను వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు లాభం జరిగేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మీడియా సంస్థలు తనకు వివరణ ఇవ్వాలని, లేకుంటే న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు. ఇరవై నాలుగు గంటల్లో తనకు క్షమాఫణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదాయపన్ను శాఖ దాడుల నేపథ్యంలో వచ్చిన వార్తల్లో వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైనట్లు ప్రచారం చేసిన మీడియా సంస్థలు తనకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అదంతా తప్పుడు ప్రచారం అని ఆయన కొట్టిపారేశారు. మీడియాలో వచ్చిన ప్రచారం ఆధారంగా ఇన్కమ్ టాక్స్ అధికారులు ప్రశ్నిస్తూ తనను వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు లాభం జరిగేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మీడియా సంస్థలు తనకు వివరణ ఇవ్వాలని, లేకుంటే న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు. ఇరవై నాలుగు గంటల్లో తనకు క్షమాఫణ చెప్పాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment