ఏ రోగమో మాకే తెలియదు.. పుకార్లు ప్రచారం చేయొద్దు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 04, 2018

ఏ రోగమో మాకే తెలియదు.. పుకార్లు ప్రచారం చేయొద్దు


తన సోదరుడు రిషికపూర్ కి సంభవించిన వ్యాధి ఏంటో ఇంకా తమకే తెలియదని, కాబట్టి మీడియా పుకార్లు ప్రచారం చేయొద్దని రిషికపూర్ సోదరుడు రణ్ ధీర్ కపూర్ కోరాడు. రిషికపూర్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, క్యాన్సర్ చివరి దశలో ఉందని.. ఇలా రకరకాల పుకార్లను మీడియా ప్రచారం చేస్తోందని, దయచేసి ఇలాంటివి మానుకోవాలని బాలీవుడ్ హీరోయిన్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ ల తండ్రి అయిన రణ్ ధీర్ కపూర్ సూచించాడు. ప్రస్తుతం రిషికపూర్ అమెరికా వెళ్తున్నాడని, అక్కడికి వెళ్లిన తర్వాత అతడికి ఉన్న రోగమేంటో పరీక్షలు చేసి వైద్యులు తెలియజేస్తారని తెలిపాడు. కాగా, బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తండ్రి అయిన రిషి కపూర్ అస్వస్థతతో కొద్ది రోజుల కిందట అమెరికా వెళ్లగా రెండు రోజుల క్రితం ఆయన తల్లి కృష్ణ రాజ్ కపూర్ మృతిచెందడంతో హుటాహుటిన ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

Post Bottom Ad