తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై స్టే విధించే అధికారం ఉమ్మడి హైకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను శుక్రవారం నాడు హైకోర్టు విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయని వాటిని సరిచేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై స్టే విధించే అధికారం ఉమ్మడి హైకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను శుక్రవారం నాడు హైకోర్టు విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయని వాటిని సరిచేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
No comments:
Post a Comment