వారెవ్వా.. పృథ్వీషా.. వెస్టిండీస్ తో మొదటి టెస్టులో రికార్డులివే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 04, 2018

వారెవ్వా.. పృథ్వీషా.. వెస్టిండీస్ తో మొదటి టెస్టులో రికార్డులివే..


వెస్టిండీస్ తో గురువారం రాజ్ కోట్ లో ప్రారంభమైన మొదటి టెస్టులో భారత ఓపెనర్ పృథ్వీషా పలు రికార్డులు సృష్టించాడు. అరంగేట్రం టెస్టు మ్యాచులోనే సెంచరీ (134) సాధించిన 106వ బ్యాట్సమన్ గా రికార్డు సాధించాడు. భారత్ తరపున ఆడిన మొదటి టెస్టులోనే ఇంతకుముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, అజారుద్దీన్, ఎస్ అమరనాథ్, ఎల్ అమరనాథ్ సెంచరీలు నమోదు చేయగా ఇప్పుడు వారి సరసన పృథ్వీషా చేరాడు. అదేవిధంగా సచిన్ టెండ్కూలర్, పీయూష్ చావ్లా, ఎల్ శివరామ్ కృష్ణన్, పార్థివ్ పటేల్, మణీందర్ సింగ్, వీఎల్ మెహ్రా, హర్బజన్ సింగ్, మిల్కాసింగ్, బీఎస్ చంద్రశేఖర్, ఇషాంత్ శర్మ, రవి శాస్త్రి, చేతన్ శర్మల తర్వాత అతి తక్కువ వయసులో టెస్టు క్రికెట్ ఆడిన భారత్ క్రీడాకారుడిగా పృథ్వీషా రికార్డు నమోదు చేశాడు.  పృథ్వీషా 18 ఏళ్ల 329 రోజుల వయసులో టెస్టు క్రికెట్ ఆడాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad