నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కాంగ్రెస్ పార్టీపై, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రూ. 500 కోట్లు, 3 హెలికాప్టర్లు ఇస్తానంటే ఢిల్లీ వెళ్లి కాళ్లు మొక్కుతరా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ కరెంట్ లాక్కుని రాక్షసానందం పొందిన రాక్షసుడని, ఎన్కౌంటర్ల పేరుతో ఉద్యమకారుల ప్రాణాలు తీసిన తెలంగాణ ద్రోహి అని విరుచుకపడ్డాడు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలన్నారు. కాంగ్రెస్–టీడీపీ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కాంగ్రెస్ పార్టీపై, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రూ. 500 కోట్లు, 3 హెలికాప్టర్లు ఇస్తానంటే ఢిల్లీ వెళ్లి కాళ్లు మొక్కుతరా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ కరెంట్ లాక్కుని రాక్షసానందం పొందిన రాక్షసుడని, ఎన్కౌంటర్ల పేరుతో ఉద్యమకారుల ప్రాణాలు తీసిన తెలంగాణ ద్రోహి అని విరుచుకపడ్డాడు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలన్నారు. కాంగ్రెస్–టీడీపీ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment