కేంద్ర ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు గరిష్ట స్థాయికి చేరుకుంటున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేసేలా ఇంధనంపై వసూలుచేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50 తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. అదేవిదంగా ఆయిల్ కంపెనీలు కూడా ధరలను రూ.1 తగ్గిస్తాయని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నుల్లో కూడా రూ.2.50 తగ్గించాలని వాటికి లేఖలు రాసినట్టు తెలిపింది. ఇప్పటికే కొన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.92కు చేరుకున్న సంగతి తెలిసిందే. పెరిగిపోతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే భారీ ఎత్తున్న విమర్శలు కురుస్తున్నాయి. అదీకాకుండా ఈ ఏడాది చివరినాటికి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు గరిష్ట స్థాయికి చేరుకుంటున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేసేలా ఇంధనంపై వసూలుచేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50 తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. అదేవిదంగా ఆయిల్ కంపెనీలు కూడా ధరలను రూ.1 తగ్గిస్తాయని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నుల్లో కూడా రూ.2.50 తగ్గించాలని వాటికి లేఖలు రాసినట్టు తెలిపింది. ఇప్పటికే కొన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.92కు చేరుకున్న సంగతి తెలిసిందే. పెరిగిపోతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే భారీ ఎత్తున్న విమర్శలు కురుస్తున్నాయి. అదీకాకుండా ఈ ఏడాది చివరినాటికి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
No comments:
Post a Comment