ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన జీవితంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆయన పాదయాత్రల వల్ల ఒరిగేదేమీ లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని సునీత ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమకు సమృద్ధిగా నీళ్లు అందుతున్నాయని స్పష్టం చేశారు. కాగా, అనంతపురం జిల్లా రాఫ్తాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిటాల సునీత ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండి తన పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ ను బరిలో దించే యోచనలో ఉన్నారు లేదా ఇద్దరూ అసెంబ్లీకే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.
ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన జీవితంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆయన పాదయాత్రల వల్ల ఒరిగేదేమీ లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని సునీత ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమకు సమృద్ధిగా నీళ్లు అందుతున్నాయని స్పష్టం చేశారు. కాగా, అనంతపురం జిల్లా రాఫ్తాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిటాల సునీత ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండి తన పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ ను బరిలో దించే యోచనలో ఉన్నారు లేదా ఇద్దరూ అసెంబ్లీకే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.
No comments:
Post a Comment