తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను గెలిపించి మళ్లీ అధికారం అప్పగిస్తే తెలంగాణను దోచుకుంటాడని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఆరోపించారు. అందువల్ల ప్రజలెవరూ టీఆర్ఎస్ కు ఓట్లేయవద్దని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా నుంచి విజయశాంతి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించారు. అసలు ఇప్పటివరకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాడో చెప్పలేదని, ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విజయశాంతి దుయ్యబట్టారు. ఓటేయడానికి డబ్బులు ఇస్తే తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను గెలిపించి మళ్లీ అధికారం అప్పగిస్తే తెలంగాణను దోచుకుంటాడని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఆరోపించారు. అందువల్ల ప్రజలెవరూ టీఆర్ఎస్ కు ఓట్లేయవద్దని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా నుంచి విజయశాంతి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించారు. అసలు ఇప్పటివరకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాడో చెప్పలేదని, ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విజయశాంతి దుయ్యబట్టారు. ఓటేయడానికి డబ్బులు ఇస్తే తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment