శ్రీలంకలో రాజపక్సే ఇన్! విక్రమసింఘే ఔట్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 26, 2018

శ్రీలంకలో రాజపక్సే ఇన్! విక్రమసింఘే ఔట్!


శ్రీలంక దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అనూహ్యంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రిగా రణీల్‌ విక్రమసింఘేను తొలగించి శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను నియమించారు. కొద్ది సేపటికే రాజపక్సే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. 225 మంది సభ్యులన్న శ్రీలంక అసెంబ్లీలో రణీల్ విక్రమసింఘే నాయకత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీకి 106 మంది మద్దతు ఉండగా, రాజపక్సే, సిరిసేనల పార్టీలకు కలిపి 95 మంది సభ్యులే ఉన్నారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం మెజారిటీ లేనిదే ప్రధానిని పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు. తాజా పరిమాణాలు శ్రీలంకలో ఎలాంటి రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తాయో చూడాలి. 

No comments:

Post a Comment

Post Bottom Ad