పరకాల నుంచే పోటీ చేస్తా: మాజీ మంత్రి కొండా సురేఖ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 01, 2018

పరకాల నుంచే పోటీ చేస్తా: మాజీ మంత్రి కొండా సురేఖ


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకిచ్చి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి కొండా సురేఖ తాను పరకాల నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఆమె వరంగల్ తూర్పు నుంచి గెలుపొందారు. భూపాలపల్లి, వరంగల్ తూర్పు, పరకాల నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు, అభిమానులు ఒత్తిడి చేస్తున్నారని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరకాల నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. అయితే కొండా సురేఖ భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి, కుమార్తె సుస్మిత పోటీ చేస్తారా, లేదా అనేదానిపై కొండా సురేఖ స్పష్టత ఇవ్వలేదు. తాను పరకాలలో గెలుపొందడంతోపాటు వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని సురేఖ చెప్పారు.

No comments:

Post a Comment

Post Bottom Ad