ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముందస్తు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని, పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీలోకి తెస్తామని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేరుస్తామన్నారు. పెన్షన్లకు వయసును బట్టి స్లాబులు అమలు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముందస్తు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని, పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీలోకి తెస్తామని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేరుస్తామన్నారు. పెన్షన్లకు వయసును బట్టి స్లాబులు అమలు చేస్తామన్నారు.
No comments:
Post a Comment