డిల్లీలో రూ.59 పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 01, 2018

డిల్లీలో రూ.59 పెరిగిన వంట గ్యాస్ సిలిండర్


దేశ రాజధాని న్యూఢిల్లీ లో వంట గ్యాస్ ధరకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా రూ.59 ధర పెరిగింది. అయితే ఇది రాయితీ లేని వంటగ్యాస్ సిలిండర్ కు మాత్రమే వర్తిస్తుంది. ఇక రాయితీతో లభించే వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.2.89 పెరిగింది. అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, విదేశీమారక ద్రవ్య విలువతో రూపాయి పతనం కావడం వంటి కారణాలతో గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీ) తెలిపింది. ఇప్పటికే లీటర్ పెట్రల్ ధర రూ.91 కు చేరింది. ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరగడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


No comments:

Post a Comment

Post Bottom Ad