భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలసి పోటీ చేసే ఆలోచన ఏమీ లేదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం సిద్ధిపేటలో పర్యటించిన ఆయన మహాకూటమితో కలిసే ముందుకెళ్తామని తెలిపారు. ప్రస్తుతం సీట్ల గురించి ఇంకా చర్చలు ప్రారంభించలేదని, తమ దృష్టి అంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడంపైనే ఉందన్నారు. దీని కోసం వివిధ పార్టీలను మహాకూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజాకంటక కేసీఆర్ పాలనను రాష్ట్రం నుంచి రూపుమాపుతామన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టీజేఎస్ 15 సీట్లు డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 3 లేదా 5 సీట్లు కేటాయించే ఆలోచనతో ఉంది. అయితే కోదండరాం మాత్రం తమకు 15 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్టు సమాచారం.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలసి పోటీ చేసే ఆలోచన ఏమీ లేదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం సిద్ధిపేటలో పర్యటించిన ఆయన మహాకూటమితో కలిసే ముందుకెళ్తామని తెలిపారు. ప్రస్తుతం సీట్ల గురించి ఇంకా చర్చలు ప్రారంభించలేదని, తమ దృష్టి అంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడంపైనే ఉందన్నారు. దీని కోసం వివిధ పార్టీలను మహాకూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజాకంటక కేసీఆర్ పాలనను రాష్ట్రం నుంచి రూపుమాపుతామన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టీజేఎస్ 15 సీట్లు డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 3 లేదా 5 సీట్లు కేటాయించే ఆలోచనతో ఉంది. అయితే కోదండరాం మాత్రం తమకు 15 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్టు సమాచారం.
No comments:
Post a Comment