గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయానికి కృషి చేస్తున్న లేళ్ల అప్పిరెడ్డిని కాదని కొత్తగా పార్టీలో చేరిన మాజీ డీఐజీ ఏసురత్నాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కనీసం రూ.50 కోట్లు ఖర్చు పెట్టగలవారికి మాత్రమే వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని ఇప్పటికే పలువురు పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కాగా, ఏసురత్నాన్ని సమన్వయకర్తగా నియమించిన విషయాన్ని తెలుసుకున్న అప్పిరెడ్డి అనుచరులు ఆయన కార్యాలయానికి చేరుకుని వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయానికి కృషి చేస్తున్న లేళ్ల అప్పిరెడ్డిని కాదని కొత్తగా పార్టీలో చేరిన మాజీ డీఐజీ ఏసురత్నాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కనీసం రూ.50 కోట్లు ఖర్చు పెట్టగలవారికి మాత్రమే వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని ఇప్పటికే పలువురు పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కాగా, ఏసురత్నాన్ని సమన్వయకర్తగా నియమించిన విషయాన్ని తెలుసుకున్న అప్పిరెడ్డి అనుచరులు ఆయన కార్యాలయానికి చేరుకుని వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
No comments:
Post a Comment