రోడ్డు ప్రమాద మృతుల్లో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 01, 2018

రోడ్డు ప్రమాద మృతుల్లో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్


భారతదేశంలో రోడ్లపై రోజూ 56 మంది పాదచారులు మరణిస్తున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. వాహనాలు నడిపేవారే కాకుండా సైకిళ్లపై వెళ్లేవారు, నడిచి వెళ్లేవారికి కూడా రోడ్లు మృత్యు కుహరాలుగా నిలుస్తున్నాయి. గత కొన్నేళ్ల రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే.. 2014లో 12,330 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అవి 2017 నాటికి ఏకంగా 20,457కు పెరిగాయి. గతేడాది ప్రతి రోజూ 133 మంది ద్విచక్రవాహనాలు నడిపేవారు, పది మంది సైకిల్ నడిపేవారు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని అధ్యయనంలో తేలింది. దేశంలో అత్యధికంగా తమిళనాడులో అత్యధికంగా 3,507 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందగా, మహారాష్ట్రలో 1831 మంది, ఆంధ్రప్రదేశ్ లో 1379 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. సైకిల్ పై వెళ్లేవారికి, పాదచారులకు మార్గం లేకుండా అంచుల వరకు రోడ్లు వేయడం ప్రమాదాలకు కారణమవుతోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad