జనసేన దృష్టి ఆ 68 నియోజకవర్గాలపైనే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 12, 2018

జనసేన దృష్టి ఆ 68 నియోజకవర్గాలపైనే!


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానంగా 68 నియోజకవర్గాలపైన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపైనే పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లు, ఉభయగోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. జనసేన పార్టీ అత్యంత బలంగా ఉంది ఈ ఐదు జిల్లాల్లోనే. ఈ నేపథ్యంలో ఈ ఐదు జిల్లాల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని పవన్ వ్యూహ రచన చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఓట్ల చీల్చే అవకాశం ఉంది కానీ గెలిచే అవకాశం లేదని సమాచారం.

No comments:

Post a Comment

Post Bottom Ad