తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటికే మహాకూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున వివిధ పార్టీల నేతలను చేర్చుకుంటోంది. తాజాగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ ప్రతిపక్ష నేత జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేపాల శ్రీనివాస్ విజయం సాధించారు. అయితే 2004, 2009, 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. వైశ్య సామాజికవర్గానికి చెందిన రేపాల చేరికతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరనుంది.
Post Top Ad
Friday, October 12, 2018
కాంగ్రెస్ లో చేరిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment