ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌


విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌ చేశారు. హత్యాయత్నంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్‌ ఆదేశించారు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి కోడి పందేలకు ఉపయోగించే కత్తితో దుండగుడు ఈ దాడికి తెగబడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమై రక్తం కారింది. 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad