విరాట్ కోహ్లీని అఖిల్ కలవడం వెనుక.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 11, 2018

విరాట్ కోహ్లీని అఖిల్ కలవడం వెనుక..


భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రముఖ సినీ నటుడు అక్కినేని అఖిల్ కలిశారు. శుక్రవారం నుంచి హైదరాబాద్ లో  వెస్టిండీస్ తో ప్రారంభమయ్యే రెండో క్రికెట్ టెస్టుకు భారత టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. అదేవిధంగా వెస్డిండీస్ జట్టు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక యాడ్ లో నటించడానికి విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ ఇద్దరూ అన్నపూర్ణ స్టూడియోకి విచ్చేశారు. దీంతో అక్కడే ఉన్న అఖిల్ మర్యాదపూర్వకంగా కోహ్లీని కలిసి సంభాషించారు. కోహ్లీతో అఖిల్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, అఖిల్ మూడో చిత్రం.. ఇటీవలే స్పెయిన్ లో షూటింగ్ పూర్తి చేసుకువచ్చింది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad