వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అలకబూనిన విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇంకా బెట్టువీడలేదు. గత నాలుగున్నరేళ్లుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన్ను తప్పించి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన 'రావాలి జగన్ - కావాలి జగన్' కార్యక్రమంలో రాధా ఎక్కడా పాలుపంచుకోలేదు. వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాధాను పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతోంది. రాధా ఇందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో నిన్న పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడ వచ్చి రాధాను బుజ్జగించినా ఆయన బెట్టు వీడలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అలకబూనిన విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇంకా బెట్టువీడలేదు. గత నాలుగున్నరేళ్లుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన్ను తప్పించి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన 'రావాలి జగన్ - కావాలి జగన్' కార్యక్రమంలో రాధా ఎక్కడా పాలుపంచుకోలేదు. వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాధాను పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతోంది. రాధా ఇందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో నిన్న పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడ వచ్చి రాధాను బుజ్జగించినా ఆయన బెట్టు వీడలేదు.
No comments:
Post a Comment