టీఆర్ఎస్, మోదీపై విరుచుకపడిన రాహుల్ గాంధీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 21, 2018

టీఆర్ఎస్, మోదీపై విరుచుకపడిన రాహుల్ గాంధీ!


తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తొలిసారి రాష్ట్రానికి విచ్చేశారు. భైంసా, కామారెడ్డిల్లో జరిగిన బహిరంగ సభల్లో శనివారం ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఆయన విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ పాలన దేశంలోనే అత్యంత అవినీతి మయమని తేలిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. ప్రాజెక్టుల డిజైన్లు మార్చి అంచనాల పెంచి లాభపడ్డారని ఆరోపించారు. పీఎం, సీఎం ఇద్దరూ కలిసి భూసేకరణ చట్టాన్ని నీరుగార్చారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్, మజ్లిస్‌ ఒక్కటేనని చెప్పారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఏడాదిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

Post Bottom Ad